సీతాస్ చారిటబుల్ ట్రస్ట్, అక్షరయాన్ (TWWF), అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్
సంయుక్త నిర్వహణలో
మాతృవందనం ( షష్టిపూర్తి కలాలకు సత్కారం )






మాతృవందనం వీడియో
మాతృవందనం – పూర్తి వివరణ
రవీంద్రభారతి మొదటి అంతస్తులో నిన్న అంటే 25 th may 2025 @10.30 am మాతృ వందనం కార్యక్రమం ఆహ్లాద వాతావరణంలో జరిగింది . సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ , అక్షరయాన్ అభిజ్ఞ భరత్ సంయుక్త నిర్వహణలో 70 ఏళ్ళు పైబడ్డ రచయిత్రులకు సత్కారాలు చేశారు .
ముందు అమ్మ మీద పాటలు పాడారు
శ్రీవాణి ,యోగినేని శ్రీనివాస్ వేదిక మీదకి అతిధుల ఆహ్వానం పలికారు విశ్వయి క / శ్రీవాణి
ముఖ్య అతిథి విచ్చేసారు శ్రీ చిట్ల పార్థసారథి గారు
ఐఏఎస్ (రి ), రాష్ట్ర పూర్వ ఎన్నికల కమిషనర్
గౌరవ అతిథి గా జి. సృజన ఐఏఎస్
డైరెక్టర్ PR & RD
ఆత్మీయ అతిధులుగా గా
1.రష్మీ కాండ్లికర్ విన్నర్ ,Mrs ఇండియా తెలంగాణ ,SUPER క్లాసిక్ కేటగిరి
డా దుంప శ్రీదేవి
వ్యవస్థపకురాలు ,అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ గార్లు విచ్చేసారు
సభకు అధ్యక్షత వహించారు రాణి నల్లమోతు
వ్యవస్థాపకురాలు , సీతాస్ చారిటబుల్ ట్రస్ట్
స్వాగతోపన్యాసం పలికారు రాణి నల్లమోతు
మాతృవందనం రిపోర్ట్ చెప్పారు అయినంపూడి శ్రీలక్ష్మి
అనంతరం ముఖ్య అతిథి పార్థసారథి గారి సందేశం ఆద్యంతం ఆకట్టుకుంది . రచయిత్రుల కు దిశా నిర్దేశం చేస్తూ .. మారుతున్న పరిణామాల దృష్ట్యా పుస్తకాలను డిజిటలైజ్ చెయ్యాలని , 70 ఏళ్ళ పైబడ్డప్పటికీ ఇంకా రాయాలన్న తపనతో అక్షరాసేద్యం చేస్తుండటం అందునా బ్లాగులు , youtube లు నిర్వహించటం సంతోష దాయకం అన్నారు
సృజన ఐఏఎస్ గారి సందేశం లో మాతృ మూర్తులు బిడ్డల అస్తిత్వాన్ని తీర్చిదిద్దుతారని అన్నారు . సరస్వతి పుష్కరాలు నిర్వహింప బడుతున్న సందర్భంలో ఇక్కడే పుస్తక బతుకమ్మల సందడి ఉందని అన్నారు . దుంప శ్రీదేవి మాట్లాడుతూ మూడు సంస్థలు కలిసి చేస్తున్న షష్టి పూర్తి కలాలకు సత్కారం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు
రష్మీ కండ్లెకర్ గారి సందేశం ద్వారా గ్రామర్ తోపాటు పెరిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని రచయిత్రులు పెంచుకోవాలన్నారు . ఇంతమంది అమ్మాలని ఒకేవేదిక మీద చూడటం గొప్ప సుదినం అన్నారు
కణిక , అక్షరయాన్ కలిసి అయినంపూడి శ్రీలక్ష్మి రాసిన woonded heart పుస్తక సమీక్ష పోటీ నిర్వహించాయి . అందులో చక్కటి సమీక్షచేసినవారికి
వుండెడ్ హార్ట్ క్యాష్ ప్రైజెస్ అందచేశారు
మొదటి బహుమతులు
మక్కువ అరుణకుమారి
మంత్రి ప్రగడ శ్రీనివాసరావు
రెండో బహుమతులు
టేకుమళ్ళ వెంకటప్పయ్య
N లహరి
మూడో బహుమతి
నామని సుజనా దేవి
కన్సోలేషన్
దాసోజు పద్మావతి
N నిర్మలాదేవి
మామిడి స్రవంతి
ది వుండెడ్ హార్ట్ సమీక్ష ప్రత్యేక బహుమతి గ్రహీతలు
( వీరంతా మొదటిసారి రచన చేసిన వారు )
నాగజ్యోతి – బెహరిన్
దివ్య తులసి హనుమకొండ
సత్య సుమ హైదరాబాద్
. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినా పొన్నం రవిచంద్ర , గోగు శ్యామల ను సత్కరించారు .మాతృవందనం
సత్కారాలు అందచేశారు
2025 మాతృవందన పురస్కార గ్రహీతలు
1. శోభిరాల బాలాత్రిపురసుందరి(92)
2. మేజర్ డా. సి సత్యవాణి(83)
3. వాణి సరోజినీ లక్కరాజు(83)
4. డా. పి చిరంజీవిని కుమారి(83)
5. డా. సి వసుంధర (81)
6. లింగమనేని సుజాత (80)
7. తాతా కామేశ్వరి (80)
8. అద్దంకి లక్ష్మి (79)
9. డా. భమిడిమఱ్ఱి కమలాదేవి(78)
10. డా. తన్నీరు జయప్రద(77)
11. డా. కె. శ్రీదేవి (76)
12. పద్మావతి పులిమి(75)
13. జి సత్యవాణి (74)
14. డా. ఉషారాణి కోగంటి(74)
15. మద్దాళి నిర్మల (73)
16. వేరు పండా మృదుభాషిణి(73)
17. మాలా కుమార్ (73)
18. డా. షహనాజ్ బతుల్(72)
19. మంథా అన్నపూర్ణ (72)
20. ప్రొఫెస్సర్ మాదిరెడ్డి అండమ్మ (72)
21. జంధ్యాల కుసుమకుమారి(71)
22. వాడ్రేవు వీరలక్ష్మి (71)
23. షేక్ కాసింబి (71)
24. రామలక్ష్మి మోచర్ల (71)
25. గంగరాజు పద్మజ (70)
26. మద్దూరి రాజ్యశ్రీ (70)
27. విజయశ్రీ కుప్పా (70)
28. అవధానుల విజయలక్ష్మి(70)
29. సర్వమంగళ గౌరి (70)
30. ధూళిపాళ అన్నపూర్ణ(70)
31. లలితావర్మ (70)
ల కు సారె పెట్టి సత్కారం చేసారు . దేశంలోని 7,8 రాష్ట్రాల నుండి రచయిత్రులు రావటంతో పండుగ వాతావరణం నెలకొంది .
సహిత మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యూ ట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేశారు
అక్షరయాన్ డైరెక్టరీ ని ఆవిష్కరించారు
Opiration సింధూర్ విజయాన్ని చెపుతూ త్రిదళాలకు ధన్యవాదాలు చెప్పారు . జండా లు ఊపుతూ దేశమాతకు అనుకూలంగా నినాదాలు చేశారు
చివరగా అక్షరయాన్ జనరల్ సెక్రటరీ విశ్వ వందన సమర్పణ చేశారు
అది మరపురాని చిరస్మరణీya మహత్తర నిర్వహణ తాలూకు అత్యద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చింది. పదేపదే నిన్నటి అనుభూతి రోజంతా పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంది ఎంత ఆనందంగా ఉందంటే అది మాటలలో ఎప్పటికీ పొందుపరచలేనటువంటిది మీ సహృదయం మీ విశాల హృదయం నీ ఆలోచన దృక్పథానికి ఒక గొప్ప సన్నివేశమే నిన్నటి సన్మాన సభ. ఎక్కడా లోపించకుండా ఆద్యంతం అద్భుతమైన హుందాతనంతో పెట్టుబడులలో పెళ్లి స్థాయిలో ఏర్పాటు చేసిన మీ నిర్వహణ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. మమ్మల్ని అందరినీ అభినందించి ఆహ్వానించి పదేపదే పెళ్లి పిలుపు లాగా ఆదరించి ఇంత బాగా మమ్మల్ని ఆనందపరిచిన శిరస్సు వంచి నమస్కరించటం మినహా. మరి ఏమీ చేయలేము వీటన్నిటిని మించిన కానుక గ్రంధ రచన స్త్రీల జీవితాలకి నిలువుటద్దం … మీకు మళ్ళీ మళ్ళీ అభినందనలు పుష్కలంగా ఆశిస్సులు శ్రీమాత నుంచి లభించాలని కోరుకుంటున్నాను
ఇట్లు విజయశ్రీ కుప్ప
సీతా చారిటబుల్ ట్రస్ట్ వారు అక్షర యాన్ వారు అవిజ్ఞ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో
ప్రఖ్యాత సాహితీ రచయిత వ్యాఖ్యాత అయిన శ్రీమతి అయినంపూడి శ్రీ లక్ష్మీ గారి మదిలో మెదిలిన అందమైన ఊహ సామ్రాజ్యంలో జనించి మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం కన్నుల విందుగా *షష్టిపూర్తి కలాలకు మాతృ వందనం ఎన్నో మరపురాని మరువలేని తీయని స్మృతులను అందించిన మహోత్సవ వేళ .. అమ్మా.. అందరి ఫొటోస్ పుంక్చ్యువల్ గా పంపి ఎంతో ఆనంద పరిచారు.. ప్రోగ్రామ్ అంతా చాలా ప్లాన్డ్ గా నడిపించారు.. మీ విలువైన మాటలు మనసుల నల్లరించాయి… మీ దక్షత ఆకట్టుకుంది… మే ది గాడ్ బ్లెస్స్ you ఆల్ ది వే… నేను ఇందిలో భాగమైనందుకు ఆనందం కలిగింది.. ధన్యవాదములు మనస్ఫూర్తిగా… 🙏😊 మాతృ వందనం లో చక్కటి సన్మానము పొందినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది శ్రీ లక్ష్మీ గారికి విశ్వైక గారికి అక్షరయాన్ నిర్వాహకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
అద్దంకి లక్ష్మీ ముంబై
ఆత్మీయ సోదరిశ్రీలక్మీ గారికి నిన్న జరిగివ అక్షరయాన్ మాతృవందనంకి
70 ఏళ్ళు పైబడిన అమ్మలను అమ్మ మ్మలను ఆహ్వానించి అద్భుతంగా మన
పుట్టిల్లు వాళ్ళు సత్కరించి నట్లు చీరపెట్టి ఆనాడు అమ్మతో గడిపిన స్మృతులు మదిలోమేదిలేలా చేయగలిగారు
శ్రీలక్ష్మిగారు మీరు రచయిత్రులను నవ్వుతూ మర్యాదగ పలకరిస్తూ, “మీ ఊండెడుహార్డ్”పుస్తకం రిఫర్ చేస్తూ స్త్రీల ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ మేమోగ్రఫీ ప్రాముఖ్యతను చెప్పి కాన్సర్ మహమ్మారి బారినుంచి ఎలా కాపాడు కోవాలో అనటం ఆచరణీయం
ముఖ్యఅతిథి పార్థసారథిగారు (ఐ ఏ యస్), పెద్దన్నగా అక్షరయాన్ ఆడబడుచులకు ప్రయోజనకరమైన విషయాలు సైంటిఫిక్ విషయాలు అవగాహన కల్పించారు.
రచయిత్రులలో ఎంతమంది డాక్టరేట్స్ విద్యాధికులు ఉపాధ్యాయులతో సాహితీ వనంలా పరిమళాలతో గుభాలించింది .
పహల్గాం అఘాయిత్యానికి, మనఆర్మీ చేసిన “ఆపరేషన్ సింధూర్” ఘనతను ప్రశంసిస్తూ మనం జాతీయ పతాకాలతో దేశభక్తి ప్రకటించటం మనకర్తవ్యం అలానే కపులందరికీ గర్వకారణం
శ్రీమతి సృజనగారు ఐ ఏ యస్ తన ప్రసంగంలోనేటి కవుల రచనలు కవితలు సంఘహితమై నేటి తరానికి ఆదర్శంగా ఉండాలని మనం స్ఫూర్తి ప్రదాతలుగా మారాలన్నారు.అలాగే మిగతా అతిథులు కూడ చక్కని సందే శాత్మకవిషయాలతో అందరిని అల రించారు.
ఇదేకాక రుచికర భోజనాది సత్కారాలతో సీతాస్ చారిటబుల్ ట్రస్ట్, అభిజ్ఞభారత్ సహకారంతో కవిపర్యుల నాదరించారు వారికి నా హార్ధికాభినందనలు.
మీరు విశ్వైక రమాగారు టీమ్ కలసి చేసే కార్యక్రమాలు మన సంస్కృతి సౌరభాలతో, మీ ఆశయాలు విజ్ఞత ఆత్మీయతతో కూడి ముఖ్యం గా సాహితీ బతుకమ్మలకు అమితమైన ఆదరాభి మానాలను పంచుతూ మాతృవందనం ని ఒక పండుగలా జరిపారు. మహిళ మణులు సాహితీ సంరంభంలో కలం ఝళిపిస్తూ ఇంకా పైపై కెదగాలని ఉవ్వి ళ్లూరే విధంగా అందర్నీ ప్రోత్సహించిన తీరు అభినందనీయం ఆభిలషణీయం.
నేను కూడ మాతృవందనం లో మీద్వారా సత్కారం పొందగలగటం నా సాహితీ జీవనతరంగాలలో మరో మైలురాయిగా లిఖించు కుంటాను
మీకిదే నాహార్ధిక శుభాభి నందనలతో కవిరత్న
కథారత్న డా.ఉషారాణి కోగం
RECENT PUBLICATIONS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్